పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుపాటి హీరోలుగా నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’ . సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ . గురువారం ‘భీమ్లా నాయక్’ నుండి సాలిడ్ స్టిల్ ఒకటి వదిలారు మేకర్స్.. పవన్ నులకమంచం మీద, రానా ఎద్దులబండి మీద పడుకుని సేద తీరుతున్న పిక్ రిలీజ్ చెయ్యగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పవన్ ‘భీమ్లా నాయక్’ గా, రానా ‘డానియెల్ శేఖర్’ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.