తాజాగా సినీనటుడు మోహన్ బాబు గొర్రెల, మేకల పెంపకందారుల విషయంలో నోరు జారినందుకు ఆయనపై కేసు పెట్టాలని ఆ సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యాదవ సంఘం నేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గొడవ మరింత పెరుగుతోంది. మా ఎన్నికల సందర్భంగా మంచు మోహన్ బాబు ఆర్టిస్టులపై చేస్తున్న వ్యాఖ్యల సందర్భంగా వారి మనోభావాలు దెబ్బతీశారని ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం ముందురుతోంది.ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా వివాదంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. కుల సంఘాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిసినా ఏదో నోరు జారి గొడవలు తెచ్చుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు.సినీనటుడు అయినా తనలోని దూకుడు తగ్గించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గొర్రెల, మేకల పెంపకందారులు అంటే అంత అలుసా అని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా మనసు ఉంటుందని పేర్కొన్నారు. తమ కులాన్ని కించపరచడంపై ఆక్షేపిస్తున్నారు. మోహన్ బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే పలు సందర్భాల్లో కుల సంఘాలపై చేసిన కామెంట్లతో గొడవలు ముదిరి తారాస్థాయికి వెళ్లినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. పలుమార్లు దాడులు జరిగే వరకు కూడా వెళ్లిన సందర్భాలున్నాయి. దీంతో మోహన్ బాబు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. యాదవ సంఘం నేతల ఆగ్రహానికి గురవుతున్నాయి.