ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళికి సర్కారు వారి ట్రీట్ ఇదే..

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 21, 2021, 06:20 PM



సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రీకరణ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పెయిన్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అలాగే బ్యాలెన్స్ సన్నివేశాలు కూడా పూర్తిచేస్తున్నారు. మహేష్..కీర్తి సురేష్ పై రెండు పాటలు అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు పాటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. నవంబర్ 4న దీపావళి సందర్భంగా అభిమానులకు కోసం స్పెషల్ సర్కారు వారు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


`సర్కారు వారి పాట` నుంచి తొలి లిరికల్ సాంగ్ ని ఆ రోజు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట. థమన్ ట్విటర్ ద్వారా స్నీక్ పిక్ ని పంచుకోవడం ద్వారా విషయం బయటకు వచ్చింది. ఈ పాటకు మంచి ట్యూన్స్...ట్రాక్ కుదిరాయని...పాట సాహిత్యం అద్భుతంగా ఉందని చెప్పకనే చెప్పారు. అదే నిజమైతే మహేష్ అభిమానులకు దీవాలీ స్పెషల్ ట్రీట్ అదిరినట్లే. ఇప్పటికే సర్కారు వారి పాట  ఫస్ట్ లుక్..  టీజర్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పరశురాం సైతం `గీతాగోవిందం` తర్వాత  తెరకెక్కిస్తోన్న  సినిమా కావడంతో ఎంతో కాన్ఫిడెంట్ గానూ  కనిపిస్తున్నారు.


లిరికల్ రిలీజ్ అయిందంటే ప్రచారం షురూ అయినట్లే. అప్పటి నుంచి వరుసగా ప్రచారం పనుల్లో యూనిట్ నిమగ్నం కానుంది. ఇక చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరెక్కనున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. అనంతరం దర్శక ధీరుడు  రాజమౌళితో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com