బిగ్ బాస్ తెలుగు సీజన్-5 తాజా ఎపిసోడ్ లో సీక్రెట్ రూంలో ఉండి గేమ్ని పరిశీలించిన లోబో తిరిగి హౌస్ లోకి వచ్చాడు. క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న సిరి, షణ్ముఖ్, జస్వంత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. గత ఎపిసోడ్ లో గొడవ పెట్టుకున్న ప్రియ, సన్నీ కాస్త కూల్ అయినట్లు కనిపిస్తోంది. ప్రియ సన్నీ ప్లేట్ లో భోజనం చేసి కాస్త కామెడీ చేసింది. లోబో తిరిగి హౌజ్లోకి రావడంతో ఇప్పుడు గేమ్ మరింత రసవత్తరంగా ఉంటుందని రవి చెప్పుకొచ్చాడు. సీక్రెట్ టాస్కును సరిగ్గా అర్థం చేసుకోలేని జెస్సీని బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీకి అనర్హుడిగా ప్రకటించాడు. మానస్ కి స్పైసీ నూడిల్స్ తిను అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చారు. ఈ టాస్క్లో మానస్.. సన్నీతో పోటీ పడ్డాడు. సన్నీ విజేతగా నిలిచాడు. బంగారు కోడిపెట్ట అనే టాస్కులో ఎక్కువగా గుడ్లు సంపాదించి మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు కెప్టెన్సీ పోటీలోకి వచ్చారు. లోబో కి రెండు గుడ్లు ఇచ్చిన బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీలో ఉన్న వారిలో ఒకరిని అనర్హుడిగా, వేరే ఒకరికి కెప్టెన్సీ పోటీదారుడిగా పాల్గొనే అవకాశాన్ని కల్పించే అవకాశం ఇచ్చాడు. దీంతో లోబో శ్రీరామచంద్రను కెప్టెన్సీ పోటీదారుడిగా తొలగించాడు. కాజల్ ను కెప్టెన్సీ కంటెండర్ ని చేశాడు. ఈ వారం కెప్టెన్ అయ్యేది ఎవరో ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.