ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత రాజబాబు (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1995లో 'ఊరికి మొనగాడు'సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వంలో స్వర్గం -నరకం, రాధమ్మ పెళ్లి సినిమాలు నిర్మించి నిర్మాతగా మారారు. ఆయన సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాలతో పాటు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, వంటి సీరియల్స్లోనూ నటించారు.