క్రూయిజ్ నౌక డ్రగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి అనన్యా పాండేకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) మరోసారి సమన్లు జారీ చేసింది. సోమవారం మూడవ రౌండ్ దర్యాప్తుకు హజరుకావాలని ఆదేశించింది. డ్రగ్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో వాటప్స్ చాట్స్ చేసినట్లు ఆరోపణలు రావడంతో గత గురువారం ఎన్సిబి.. అనన్యను సుమారు రెండు గంటల పాటు విచారించింది. కాగా, ఆ విచారణలో తాను ఎన్నడూ మాదక ద్రవ్యాలు తీసుకోలేదని, ఆర్యన్ ఖాన్తో చాలా తక్కువ సార్లు చాట్ చేసినట్లు చెప్పారని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆధికారి ఒకరు తెలిపారు. కాగా, బుధవారం ముంబయిలోని బాంద్రాలో అనన్య ఇంటిపై ఎన్సిబి సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఆమె ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆమె దర్యాప్తులో పాల్గనాలని సమన్లు జారీ చేసింది.