శింబుపై ఒక ప్రముఖ నిర్మాత చీటింగ్ కేసు పెట్టారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన మైఖేల్ రాయప్పన్ తాజాగా మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అంతేకాదు మూడు పేజీల ఫిర్యాదుతో చెన్నై లో ఉన్న పోలీసులకు ఇవ్వడం గమనార్హం.ఫిర్యాదులో మైఖేల్ రాయప్పన్ ఏం తెలిపాడు అంటే.. శింబు వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నానని అంతేకాదు శింబుతో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా నన్ను మానసికంగా వేధించారని, నిర్మాత ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. 2016 వ సంవత్సరంలో శింబు హీరోగా నటించిన అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ అనే సినిమాకు నిర్మాతగా మైఖేల్ వ్యవహరించాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే సినిమాను శింబు విడుదల చేశాడు.కష్టం వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి సినిమా విడుదల చేశాడు.కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత నష్టం మాత్రం తప్పలేదు.ఇక మొత్తం పదిహేను కోట్ల రూపాయల నష్టాన్ని నేను ఈ సినిమాతో చవిచూడాల్సి వచ్చింది..