బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ.ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కథానాయిక. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.రాజమౌళి ‘జై బాలయ్య’ పాటను వేదికపై ఆవిష్కరించి, కార్యక్రమంలో భాగమైనందుకు తన ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఎనర్జీ తీసుకొచ్చిన బోయపాటి శ్రీనుకి రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. “డిసెంబర్ 2 నుండి అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతాయి. ప్రేక్షకులు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను' అని రాజమౌళి అన్నారు.బాలయ్య బాబు అణుబాంబు. శ్రీనుగారికి బాలకృష్ణ ఎలా చూపించాలో బాగా తెలుసు. ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి’’ అంటూ రాజమౌళి బాలయ్య బాబును ఎనర్జీ సీక్రెట్ గురించి అడిగారు. “నేను కూడా అఖండను థియేటర్లలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ డే ఫస్ట్ షోకే థియేటర్లో సినిమా చూస్తాను. టీమ్ని అభినందిస్తున్నాను, వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని రాజమౌళి అన్నారు.ఈ సినిమాకి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత.