ప్రిన్స్ మహేష్ బాబు ఒక వైపు సినిమా రంగం లోను, మరో వైపు వాణిజ్య రంగం లోను దూసుకు పోతున్నాడు. సినిమాలకు తీసుకునే అంత రెమ్యూనరేషన్ ని ఒక్క యాడ్ కి తీసుకుంటాడు మహేష్, రీసెంట్ గా మహేష్ బాబు ఓ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానికి ఏకంగా 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ కంపెనీకూల్ డ్రింక్ కంపెనీ అని సమాచారం. ప్రముఖ సాఫ్ట్ కూల్ డ్రింక్ మౌంటెన్ డ్యూ అనే బ్రాండ్ కు ప్రిన్స్ మహేష్ బాబు అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అధికారికం గా ఆయన ట్విట్టర్ లో పెర్కొన్నారు. అయితే ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటి కే ఐడియా, సంతూర్, ప్యారగన్, అభి బస్, తో పాటు థంప్స్ అప్ బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన లీస్ట్ లో కూల్ డ్రింక్ మౌంటెన్ డ్యూ కూడా చేరింది. కాగ గతం లో మౌంటెన్ డ్యూ కు అంబాసిడర్ గా అక్కినేని అఖిల్ ఉండే వాడు. ఆయన కాంట్రాక్ట్ ముగియడం తో తాజా గా ప్రిన్స్ మహేష్ బాబు ను మౌంటెన్ డ్యూ కంపెనీ తీసుకుంది.