2019లో విడుదలైన దర్శకుడు శాంతకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం 'మగముని'. విమర్శకుల ప్రశంసలు పొందిది.ఈ మూవీ విడుదలైన రెండేళ్ల తర్వాత కూడా అవార్డులను గెలుచుకుంటూనే ఉంది. ఈసారి, ఈ చిత్రం 15వ అయోధ్య ఫిల్మ్ ఫెస్టివల్లో 'మగముని' చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకన్నాడు హీరో 'ఆర్య'. నటీమణులు ఇంధూజ మరియు మహిమా నంబియార్లతో కలిసి చిత్రంలో కథానాయకుడిగా ఆర్య నటించాడు
ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన దర్శకుడు శాంతకుమార్, "అయోధ్య ఫిల్మ్ ఫెస్టివల్ 15వ వార్షికోత్సవంలో 'మగముని' చిత్రానికి ఆర్య 'ఉత్తమ నటుడు' అవార్డును గెలుచుకున్నారు అని తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో వరుస అవార్డులను గెలుచుకుంది.
దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు 'డిఆర్యుకే' ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు మరియు బెస్ట్ ఫీచర్ వంటి అవార్డులు గెలుచుకున్న వాటిలో కొన్ని ఉన్నాయి. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫిల్మ్ అవార్డులు గెలుచుకున్నారు. అదే చిత్రానికి మాడ్రిడ్ 2021 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకున్న నటి మహిమా నంబియార్, అయోధ్య ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నందుకు తన సహనటుడు ఆర్యను నటి మహిమా నంబియార్ అభినందించారు.