లెజెండరీ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మరణించారు. నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ సింగ్ రాయ్' . ఈ సినిమాకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి శ్యామ్ రాయ్ సింగ్ మూవీ కోసం చివరి పాట రాసారు .ఈ చిత్రాన్ని సిరివెన్నెలకి అంకితం ఇస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆకట్టుకునేలా పాడారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.