అన్ని పుకార్లకు స్వస్తి పలికి, హీరో నాగ చైతన్య మరియు రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన తెలుగు చిత్రం 'థ్యాంక్యూ' ఈ చిత్ర నిర్మాతలు బుధవారం తమ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తామని మరియు ఓటిటీ లో విడుదల చేయరని ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటనతో కూడిన పోస్టర్ను విడుదల చేసింది.
ఆ ప్రకటనలో "'థ్యాంక్యూ' చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఎంతో అంకితభావంతో ఈ చిత్రాన్ని నిర్మించాము ఈ మూవీ ని థియేటర్స్ లో మాత్రమే చూస్తారని ఆశిస్తున్నాం అని తెలిపారు. ఇక ఈ 'థాంక్యూ' చిత్రం బిగ్ స్క్రీన్ మీదనే విడుదల కానుంది. ఈ సందేశాన్ని కలిగి ఉన్న అదే పోస్టర్ను చిత్ర హీరోయిన్ రాశి ఖన్నా తన టైమ్లైన్లో కూడా పోస్ట్ చేసింది.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో పుకార్లకు దారితీసింది.ఈ క్లారిటీ ద్వారా చిత్ర నిర్మాతలు పుకార్లకు ముగింపు పలికారు. చిత్ర బృందం.