దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్లో ప్రీమియర్గా ప్రదర్శించబడుతుంది. ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం.