దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది, మరోవైపు కరోనా మహమ్మారి మరోసారి సినీ పరిశ్రమను వణికిస్తోంది. కోవిడ్ సినీ తారలను అస్సలు వదలడం లేదు. త్రిష, రాజేంద్ర ప్రసాద్, శోభన, మహేష్ బాబు మరియు ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ సిరి కూడా కరోనా బారిన పడ్డారు.అయితే గత వారం హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత కీర్తి సురేష్ కోవిడ్ నుంచి కోలుకుంది. నెగెటివ్ అని కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. నా పట్ల మీ అందరి ప్రేమ మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు... అందరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను. ”ఆమె తన ప్రస్తుత ఫోటోలను షేర్ చేసింది. దీంతో కీర్తి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.