జనవరి 20న తన పుట్టినరోజు కావడంతో ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నరేష్ 1972లో 'పండంటి కాపురం' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంత సుదీర్ఘ కెరీర్లో తనకు సహకరించిన కృష్ణ మరియు విజయ నిర్మలకి కృతజ్ఞతలు తెలిపారు. 'మా' గురించి మాట్లాడుతూ.. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం దీనిని ఏర్పాటు చేశామని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని అన్నారు. దాదాపు 30కిపైగా కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. త్వరలో కౌన్సిల్ సభ్యులంతా సమావేశమై తమ సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. టికెట్ ధరల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఎలాంటి పదవులు ఆశించలేదన్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉంది తప్ప రాజకీయాలపై లేదు.