ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్- ఐశ్వర్య మళ్లీ కలుస్తారు.. ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యవాక్యలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 19, 2022, 10:35 PM



స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య విడాకుల పై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యవాక్యలు చేసారు.  తాజాగా వీరి విడాకుల పై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.  ధనుష్ విడాకులపై మీ స్పందన ఏమిటని అడిగారు మీడియా, అయన మాట్లాడుతూ త్వరలో ఇద్దరూ కలుస్తారని మీడియాకు షాక్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధనుష్, ఐశ్వర్య మధ్య మనస్పర్థలు వచ్చాయి.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని.. ప్రస్తుతం చెన్నైలో లేరని.. ఈ విషయమై వారితో ఫోన్‌లో మాట్లాడానని.. నాతో పాటు ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ కూడా చెప్పారు. విడాకుల విషయమై మరోసారి ఆలోచించాలి అని, త్వరలోనే వాళ్లు మళ్లీ కలుస్తారు” అని చెప్పుకొచ్చారు ధనుష్ తండ్రి కస్తూరి రాజా. దీంతో మరోసారి అభిమానుల్లో ఆశ చెలరేగింది. ధనుష్- ఐశ్వర్య మళ్లీ కలవాలని కోరుకుంటున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com