టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించిన నటీ త్రిష స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నట్లు సమాచారం.త్రిష చివరి స్ట్రెయిట్ తెలుగు చిత్రం 2016లో విడుదలైన నాయకి.ఇదిలా ఉంటే, తెలుగులో "బృందా" అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది.ఈ సిరీస్ షూటింగ్లో త్రిష ప్రస్తుతం బిజీ గా ఉంది.ఆమె "బృందా" సెట్స్ నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. "బృందా విత్ ఎ లిల్ లవ్ ఆన్ సైడ్" అని క్యాప్షన్ తో ఆమె ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పోలీసు యూనిఫాంలో త్రిష అందంగా కనిపిస్తుంది."బృందా" చిత్రానికి సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నారు. ఇతర భాషల్లోకి కూడా ఈ సినిమాని డబ్ చేయాలని భావిస్తున్నారు అని వెల్లడి.