అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'మేజర్'.ఈ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్నట్టు కొన్నిరోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించారు.అయితే తాజాగా ఈ సినిమా ఆ రోజు రిలీజ్ కావడం లేదు అని తెలిపారు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది అని ప్రకటించారు.ఈ సినిమాని సోనీ పిక్చర్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ నిర్మించారు.