బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయినట్టు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని కూడా ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తారని తెలిసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయట. 'టైగర్' తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని అనేది న్యూస్. రౌడీ హీరో అంటే జాన్వీకి బాగా ఇష్టం. అతడితో రొమాన్స్ చేయాలనుందని గతంలోనే మనసులో మాటను బయట పెట్టింది. ఇప్పుడు.. ఆ కోరికను తీర్చుకోబోతుంది అన్నమాట.