ఇంకా తెరంగ్రేటం చేయలేదు కానీ బోలెడు మందిని ఫాలోవర్స్గా చేర్చుకుంది బాలీవుడ్ బాద్షా షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్. తాజాగా తల్లి గౌరీ ఖాన్ తన కుమార్తెతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. జీన్స్, టీ షర్ట్స్లో గౌరీ, సిల్వర్ కలర్ డ్రెస్లో సుహానా ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. లండన్లోని ప్రముఖ కాలేజీలో చదువుతోన్న సుహానా తల్లితో కలిసి లండన్లో ఎంజాయ్ చేస్తోంది. కాలేజీ చివరిరోజులు కావడంతో లండన్ మొత్తం చుట్టేస్తోంది. కాగా గౌరీ పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.