ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేశ దిమ్మరి’

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 12, 2018, 12:17 PM



తనిష్ హీరోగా నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. సవీణ క్రియేషన్స్ బ్యానర్ పై స్వతంత్ర గోయల్ (శావి USA)నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత స్వతంత్ర గోయల్ మాట్లాడుతూ ” ఇటివలే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ప్రశంసించి యు/ఎ సర్టిఫికేట్ అందించారు. దర్శకుడు నాగేష్ గారు ఈ సినిమాను అందరూ చూసి ఆనందించేలా రూపొందించాడు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..” అని తెలిపారు.


దర్శకుడు నాగేష్ నారదాసి మాట్లాడుతూ ” ఈ చిత్రాన్ని పంజాబ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , హ‌ర్యానా, సిమ్లా వంటి అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రించాము. దేశ‌దిమ్మ‌రి చిత్రానికి సుభాష్ ఆనంద్ అందించిన‌ సంగీతం , ప్ర‌దీష్ ఆంటోని కొరియోగ్ర‌ఫీ రెండు హైలైట్ గా ఉంటాయి. ఈ సినిమాను రజినీ కాంత్ ‘కాలా’ ను చిత్రీకరించిన హిలినీయం 8R లేటెస్ట్ వెర్షన్ కెమెరాతోనే మొత్తం సినిమాను చిత్రీకరించడం జరిగింది. ఇక సినిమాలో ‘హే పైసా’ అంటూ డ‌బ్బు పై వ‌చ్చే ఓ సెటైరిక‌ల్ సాంగ్‌ని త‌నీష్ స్వ‌యంగా పాడటం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. “అన్నారు.


తనీష్, షిరీన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్,విజయ్,సమ్మోట గాంధి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి నంద‌మూరి హ‌రి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గా , మ‌ల్లిఖార్జున్ సినిమాటోగ్ర‌ఫీని అందించారు. సుభాష్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com