ఒకప్పుడు యూత్ కథా చిత్రాలనే తెరకెక్కించే మారుతి ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలని కూడా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆయన సినిమాలకి అశేష ఆదరణ లభిస్తుంది. దర్శకుడిగా పలు చిత్రాలు చేస్తూనే ఇతరుల సినిమాలకి కథలు కూడా అందిస్తుంటాడు. తాజాగా ఆయన బ్రాండ్ బాబు అనే చిత్రానికి కథ అందించారు. సుమంత్ శైలేంద్ర .. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రభాకర్.పి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో సినిమాపై భారీ ఆసక్తి కలిగేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేసిన టీం తాజాగా టీజర్ విడుదల చేశారు. దీనిని బట్టి చూస్తుంటే ఈ చిత్రం అటు యూత్ ఇటు ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇందులో మురళీశర్మ కీలకమైన పాత్ర పోషిస్తుండగా, రాజారవీంద్ర .. 'సత్యం'రాజేశ్ .. పూజిత పొన్నాడ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. 'బ్రాండ్ బాబు' ద్వారా హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతోన్న సుమంత్ శైలేంద్రకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.