టాలీవుడ్లో హిట్ కాంబినేషన్లలో నటసింహం బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను ఒకటి. ఈ కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కు బాలయ్యబాబు సత్తాను మరోసారి రుచి చూపించాయి. వీరి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా గతేడాది మంచి కరోనా టైం లో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుందని నందమూరి అభిమానులు కోరుకున్నారు. అభిమానుల కోరిక మేరకు, బాలయ్య అఖండ మూవీని సీక్వెల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక అప్డేట్ చిత్రసీమలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ మధ్యనే అఖండ సీక్వెల్ పనులను స్టార్ట్ చెయ్యమని బోయపాటికి బాలయ్య పురమాయించాడట. దీంతో తన రచయితల బృందంతో కలిసి బోయపాటి పెన్ను తో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. అఖండ సినిమాలో ఉన్న చిన్నపిల్ల సీక్వెల్ లో టీనేజ్ లోకి ఎంటరవుతుందని, ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఆపద నుండి కాపాడటానికి అఖండ తిరిగి వచ్చే నేపథ్యంలో సీక్వెల్ నడుస్తుందని తెలుస్తుంది.
త్వరలోనే బోయపాటి - రామ్ పోతినేని డైరెక్షన్లో ఒక సినిమా రూపొందబోతుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తర్వాత బోయపాటి అఖండ సీక్వెల్ చేస్తారని అనుకుంటున్నారు.