ఛలో సినిమాతో 2018లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక మండన్నా. అనతికాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజుకు ఎదిగిన రష్మిక గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా యువతరంలో రష్మికాకు భారీ ఫాలోయింగ్ క్రేజ్ ఉంది. రష్మికా ఇంస్టాగ్రామ్ ఖాతాకు 30మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారంటే, ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఎప్పటికప్పుడు తన మూవీ అప్డేట్లను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ రష్మిక తన ఫాలోవర్లను పెంచుకుంటుంది. తాజాగా రష్మిక తన వర్కౌట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తీవ్రమైన ఎక్సర్సైజులను చేసిన తర్వాత తన శరీరం నుండి వస్తున్న చెమటను అద్దంలో చూసుకుంటూ దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసి, ఆహ్!సాటిస్ఫైడ్ ... అంటూ కామెంట్ చేసింది. రష్మిక పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.
ప్రస్తుతం, రష్మిక రణ్ బీర్ తో 'యానిమల్', కోలీవుడ్ హీరో విజయ్ 66వ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఆమెకు తొలి పాన్ ఇండియా సక్సెస్ ఇచ్చిన పుష్ప సీక్వెల్ పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.