సెన్సషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాని తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్-అడ్వెంచర్గా రానున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి అని సమాచారం. ఈ సినిమాని కెఎల్ నారాయణ నిర్మించనున్నారు.