రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ రూపొందించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్, నటి ఛార్మి కౌర్ ఈ సినిమాని భారీ బడ్జెట్టుతో నిర్మించారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే ఈ సినిమాలో విజయ్ కు జోడీగా నటిస్తుండగా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతో మైక్ టైసన్ భారతీయ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
తాజాగా లైగర్ చిత్రబృందం ముంబైలో సందడి చేసింది. లైగర్ సహ నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అనన్యా పాండే, హీరో విజయ్ దేవరకొండ కలిసి ఒక రెస్టారెంట్ నుండి బయటకు వస్తుండగా మీడియా క్లిక్ మనిపించింది. లైగర్ అని అరుపులతో ఆ వాతావరణం నిండిపోగా ఈ క్రమంలో మీడియా ముందుకు రావటానికి విజయ్ ఒకింత సిగ్గుపడ్డారు. అనన్యా, ఛార్మి రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన విజయ్ మాత్రం బయటకు రాకుండా అక్కడే తచ్ఛిట్లాడాడు. ఇంతలో ఛార్మి ఎందుకు దాక్కుంటున్నావు? బయటకు రా అంటూ విజయ్ చెయ్యి పట్టుకుని మీడియా ముందుకు తీసుకొచ్చింది. ఏం మాట్లాడకుండానే తన కారు ఎక్కి విజయ్ వెళ్లిపోయారు. స్క్రీన్ పై ఎంతో బోల్డ్ గా, డేరింగ్ గా నటించే విజయ్ సిగ్గు పడటం చాలా కొత్తగా ఉంది. లైగర్ చిత్రం ఆగస్టు 25న విడుదల కాబోతుంది.