పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుండి రాబోతున్న మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో శృతి హాసన్ కథానాయిక. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. 30శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
రాధేశ్యామ్ డిజాస్టర్ తో ప్రభాస్ తదుపరి సినిమాల అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో, ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ పైనే డార్లింగ్ ఫ్యాన్స్ అన్ని ఆశలు పెట్టుకున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నిన్ననే సలార్ తాజా షెడ్యూల్ స్టార్ట్ అయింది. దీంతో త్వరలోనే ఈ మూవీ నుండి బిగ్ అప్డేట్ ముఖ్యంగా టీజర్ రిలీజవుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ, సలార్ నిర్మాత విజయ్ కిరంగదుర్ మే నెల్లో సలార్ టీజర్ రావట్లేదని ఖరారు చేసి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు. కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ లో, మే నెల్లో సలార్ టీజర్ తప్పకుండ వస్తుందని ఎంతో నమ్మకంగా చూపిన ప్రశాంత్ నీల్ మాటలు కేవలం అభిమానులను శాంతపరచటానికే అని క్లియర్ గా తెలిసిపోతుంది. దీంతో ఒకింత నిరాశకు గురైన డార్లింగ్ ఫ్యాన్స్, టైం తీసుకున్నా పర్లేదు కేజీఎఫ్ తరహాలో దేశవ్యాప్త ప్రభంజనం సృష్టించేలా సలార్ మూవీని రూపొందించమని ప్రశాంత్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.