భారతదేశం కోసం ప్రాణాలు విడిచిన చక్రవర్తులలో సామ్రాట్ 'పృథ్విరాజ్ చౌహన్' ఒకరు. జనాలకు అంతగా తెలియని ఈ వీరుడి కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.
సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్ బయోపిక్ గా తెరకెక్కిన పృథ్విరాజ్ సినిమాను చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేసారు. లీడ్ రోల్ లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించగా, ఆయనకు జతగా రాణి సంయోగిత పాత్రలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ నటించింది. ఈ సినిమాతోనే మానుషీ సినీరంగప్రవేశం చేస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూన్ 3న విడుదల కానుంది.
ఈ సినిమాను యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు చంద్రప్రకాష్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన అమిత్ షా పృథ్విరాజ్ సినిమాను చూడబోతున్నారు.