బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన కరణ్ జోహార్ నేడు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఎందరో నటీనటులను బాలీవుడ్ కి అందించిన ఘనత కరణ్ దే. అప్పటికే బాలీవుడ్ లో ఉన్న నటీనటులకు స్టార్ స్టేటస్ ను ఇచ్చింది కూడా ఆయనే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం ముంబైలో గ్రాండ్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, కరీనా కపూర్ తదితరులు హాజరయ్యే ఈ పార్టీలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ సెలెబ్రిటీలు కూడా హాజరు కానున్నారు. విచిత్రమేంటంటే, బాలీవుడ్ లో జరగబోయే ఈ గ్రాండ్ పార్టీకి ఇద్దరు టాలీవుడ్ సెలెబ్రిటీలకే ఆహ్వానం రావడం. వారెవరనుకుంటున్నారా? రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా.
కరణ్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న లైగర్ చిత్రంతో విజయ్ బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని అందుకే తన పుట్టినరోజు పార్టీకి కరణ్ విజయ్ ను ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది.