టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మూవీస్ ను అందించే నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. ఆ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'రాజమండ్రి రోజ్ మిల్క్'. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. జై, అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఇంట్రోయూప్ ఫిలిమ్స్ బ్యానర్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. గోవింద్ వసంత్, యశ్వంత్ నాగ్, భరత్ సౌరభ్, అజయ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మిగిలిన విషయాలు తెలియాల్సివుంది.