కోలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు బాల డైరెక్షన్లో హీరో సూర్య ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ మూవీ కన్యాకుమారిలో మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా సడెన్గా ఆగిపోయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కథ పరంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చెయ్యాలని దర్శకుడు బాల భావిస్తున్నారట. అలాంటప్పుడు మూవీ బడ్జెట్ అనుకున్నదాని కన్నా రెండింతలు పెరుగుతుంది. ఈ విషయమై దర్శక నిర్మాతలు షూటింగ్ కు బ్రేకిచ్చి చర్చలు జరుపుతున్నారట. చూడాలి... ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో!.
సూర్య కెరీర్లో 41వ చిత్రంగా,సూర్య సొంత నిర్మాణ సంస్థైన 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కధానాయికలు సందడి చేయనున్నారట. లీడ్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్, సెకండ్ హీరోయిన్ గా కృతి శెట్టి నటించబోతున్నట్టు సమాచారం.