స్టార్ హీరోయిన్స్ అందరు జీరో సైజ్ కోసం నానా తంటాలు పడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే నేటితరం హీరోయిన్స్ మాత్రమే కాదు అలనాటి అందాల భామలు కూడా తమ ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెడుతూ జీరో సైజ్లోకి మారి షాకిస్తున్నారు.
అందంగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిమ్లా ఆపిల్ పండులా మెరిసిపోతూ సౌత్ ఇండస్ట్రీ ప్రజలను ఆకర్షించి డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది.ఇటీవలి కాలంలో ఖుష్బూ లుక్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దాదాపు 15 కేజీల బరువు తగ్గిన మేడం ఇప్పుడు కుర్రహీరోయిన్స్ మాదిరిగా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఖుష్బూ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, ఇందులో ఖుష్బూ క్యూట్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. 50 ఏళ్ల ముద్దుగుమ్మ 25 ఏళ్ల అమ్మాయిలా మారిందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తన అందచందాలతో సౌత్ని ఓ ఊపు ఊపేసిన ఖుష్బూ విక్టరీ వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు. ఈ బ్యూటీ 50 ఏళ్ళ వయసు వచ్చిన చెక్కుచెదరని చర్మ సౌంద్యరంతో కుర్ర హీరోయిన్లకు ,ఎమటలు పట్టించేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తన బ్యూటీ సీక్రెట్ ను కూడా తెలియజేస్తూ ఉంటుంది.
తమిళంలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ వారి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది.అందుకే ఆమెకు గుడులు కట్టి పూజలు చేశారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్ట్లు పెడుతూ అలరిస్తుంది. రీసెంట్గా ఖుష్బూ స్లిమ్ లుక్లోకి మారిన ఫొటోలు షేర్ చేసింది. ఇవి చూసి షాక్ అవుతున్నారు.
నాలుగేళ్ల క్రితం వరకూ ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తూ వచ్చారు ఖుష్బూ. అది కూడా ఎక్కువగా గెస్ట్ రోల్స్ మాత్రమే చేశారు. అయితే ఇప్పుడు కెరీర్ని సీరియస్గా తీసుకున్నట్లున్నారు. ఇటీవల 'అన్నాత్తే'లో నటించారు. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు గోపీచంద్ సినిమా. దీన్ని బట్టి చూస్తే ఖుష్బూ ఇక నాన్స్టాప్గా సినిమాలు చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.