చంద్రశేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమా రధం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో గీతా ఆనంద్, చాందినీ భాగవానీని హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో యాక్షన్ డైరెక్టర్ బి గోపాల్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పారు బిగోపాల్. ఈమధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ అయిన RX100 , గూడాచారి సినిమాలా రధం సినిమా కూడా భారీ విజయం ఆదుకోవాలన్నారు ఆర్ఫీ పట్నాయక్. ఈ కార్యక్రమంలో మైత్రిమూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని కూడా పాల్గొన్నారు.