టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున తన పుట్టిన రోజుని రేపు జరుపుకోనున్నారు.. ఈ సందర్భంగా అతడి కుమారుడు అఖిల్ తాజాగా నటిస్తున్న మూవీ టీజర్ ను బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్ తన మూడో మూవీని చేస్తున్నాడు.. యూరప్ నేపథ్యంతో సాగే ప్రేమకథ కావడంతో ఎక్కువ శాతం షూటింగ్ అక్కడే జరుపుకుంటున్నది. ఈ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ను పరిశీలనలో ఉంది..రేపు ఈ మూవీ టైటిల్, అఖిల్ లుక్తో పాటు సాంగ్ టీజర్ను కూడా విడుదల చేయనున్నారని వార్తలు వినవస్తున్నాయి..