నల్గొండ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణం వార్త తనను షాక్ కు గురి చేసిందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు..”హరికృష్ణ గారు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. హరికృష్ణగారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానూభూతిని తెలియజేస్తున్నాను. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని రామ్ చరణ్ పేస్ బుక్ ద్వారా తెలియజేశారు.