ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాశీఖన్నా ఒక విజయం, ఒక పరాజయం చూసింది. ఆమె నటించిన తొలిప్రేమ కమర్షియల్గా మంచి విజయం సాధించింది. శ్రీనివాస కల్యాణం మాత్రం నిరాశపరిచింది. సినీరంగంలో ఇలాంటివి మామూలే. అయితే రాశీఖన్నాకు మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం ఆమె తమిళంలో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది.
మన చుట్టూ ఎప్పుడూ పోటీవాతావరణం ఉండాలి. అప్పుడే మన ఎదుగుదల వేగంగా ఉంటుంది అని రాశీ స్పష్టం చేసింది. మన గురించి ఎవరూ పట్టించుకోకుంటే థ్రిల్ ఉండదని తేల్చి చెప్పింది. నటన గురించి చెబుతూ మనకంటే ఎదుటివారికే మన టాలెంట్ గురించి తెలుస్తుంది అనుకుంటా… అందుకే కొత్త కొత్త పాత్రలు సృష్టిస్తుంటారు. అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే ప్రతిభ వెలుగులోకి వస్తుంది అని రాశీఖన్నా తెలిపింది.