మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ లాస్ దీపిక పదుకొనేకి గెయిన్ అన్న సంగతి తెలిసిందే. ఒకరి నష్టం ఇంకొకిరికి లాభంగా మారిన వైనంపై బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర డిబేట్ సాగుతోంది. అయితే ఈ నష్టం వెనక కారణాలపైనా ప్రస్తుతం కొనసాగింపు కథనాలు వెలువడుతున్నాయి. గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన క్లాసిక్ సినిమాలన్నిటా తొలి ఆప్షన్ ఐశ్వర్యారాయ్. దేవదాస్ సినిమా తర్వాత ఐష్తో కలిసి పని చేసేందుకు భన్సాలీ ఎంతగానో తహతహలాడారు. కానీ ఎందుకనో ఐష్ అతడికి కనెక్ట్ కాలేదు. రకరకాల కుంటె సాకులు చెప్పి అతడి నుంచి తప్పించుకుంది.
దేవదాస్ హమ్ దిల్ దే చుకే సనమ్ గుజారిష్ చిత్రాల తర్వాత ఎన్నో గ్రేట్ ఛాన్సులు భన్సాలీ ఇచ్చినా వాటన్నిటినీ ఐష్ మిస్ చేసుకుంది. భన్సాలీ తెరకెక్కించిన 600కోట్ల క్లబ్ చిత్రం `పద్మావతి`లో తొలి ఆప్షన్ ఐశ్వర్యారాయ్. కానీ దీపికకు ఆ ఛాన్స్ వెళ్లింది. ఇందులో సల్మాన్ ఖాన్కి అవకాశం ఇస్తే తాను నటించనని ఐష్ భీష్మించి వదులుకుందని చెప్పుకున్నారు. కాలక్రమంలో ప్లాన్ మొత్తం మారిపోయి చివరికి రణవీర్ షాహిద్ దీపికలతో ఆ సినిమాని పూర్తి చేశారు భన్సాలీ. అంతకుముందు దీపిక నటించిన రామ్లీల భాజీరావ్ మస్తానీలకు ఐష్ తొలి ఆప్షన్. కానీ వాటిని మిస్ చేసుకుంది. ఆ క్రమంలోనే భన్సాలీతో ఐష్కి విభేధాలు ఉన్నాయని ప్రచారమైంది.
ప్రస్తుతం మరోసారి సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్ చేసిన సినిమాని కాదనుకుని అనురాగ్ కశ్యప్ ఇచ్చిన ఛాన్స్ వైపు మొగ్గు చూపడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. అనురాగ్ దర్శకత్వంలో భర్త అభిషేక్ బచ్చన్తో కలిసి ఐష్ `గులాబ్ జమూన్` అనే చిత్రంలో నటిస్తోంది. రావణ్ తర్వాత మళ్లీ ఐష్ - అభి జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇక ఈ సినిమాతో పాటు వో కౌన్ థీ జాస్మిన్ అండ్ రాత్ ఔర్ దిన్ చిత్రాల్లో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. అయితే భన్సాలీతో తనకు ఎలాంటి విభేధాలు లేవని తనతో కలిసి పని చేసేందుకు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటానని ఐష్ తన ప్రతినిధితో ప్రకటించడాన్ని బట్టి.. ఆ ఇద్దరిమధ్యా అసలేం జరుగుతోందో అన్న కన్ఫ్యూజన్ నెలకొంది.