దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రాజశేఖరరెడ్డి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు. వైఎస్సార్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, అందుకే దీనికి ‘యాత్ర’ అనే టైటిల్ను పెట్టామని దర్శక నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. కాగా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ పాదయాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలతో ‘సమర శంఖం’ అనే పాటను విడుదల చేశారు
నీ కనులలో కొలిమై.. రగిలే కలేదో’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ నాటి వైఎస్ఆర్ని గుర్తు చేస్తున్నాయి. సంగీతం కె అందించగా.. కాలభైరవ ఈ గీతాన్ని ఆలపించారు. ఇక సత్యన్ సూర్య సినిమాటోగ్రఫీలో మమ్ముట్టి అచ్చగుద్దినట్టు వైఎస్ఆర్లా కనిపిస్తున్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.