అచ్చమైన గ్రామీణ క్రీడ కబడ్డీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రమోట్ చేయనున్నారు.. త్వరలోనే ఈ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో నల్గొండ ఈగల్స్ టీమ్ ను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ టీమ్ కు ఎస్ఎస్ రాజమౌళి మెంటర్ గా వ్యవహరించనున్నారు.. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.