ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్ లో శర్వానంద్, సాయిపల్లవి షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 05, 2018, 03:41 PM



హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల కోల్ కతాలో 70 రోజుల పాటు జరిగిన షెడ్యూల్లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను నేపాల్ లో నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా నేపాల్ లో నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు అక్కడ కొనసాగే షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్ .. డాక్టర్ గా సాయిపల్లవి నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com