ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. భక్తిగీతాలు ఆలపించే గాయని పూజా ప్రసాద్తో కార్తికేయ ప్రేమలో ఉండగా.. వీరిద్దరి పెళ్లికి ఇరు వర్గాలు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం చేశారు. రాజమౌళి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది చివరిలో వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా పూజా.. ప్రముఖ నిర్మాత ‘జగపతి’ రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె. నటుడు జగపతిబాబుకు రాంప్రసాద్ సోదరుడు అవుతారు. ఇదిలా ఉంటే రాజమౌళి దగ్గర అసిస్టెంట్గా చేయడంతో పాటు పలు చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్గా పనిచేసిన కార్తికేయ.. ప్రస్తుతం వివిధ రంగాల్లో తన ప్రతిభను కనబరుస్తున్నాడు.