విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ గురువారం నాడు విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నారు. మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు.