బాలీవుడ్ హీరోయిన్ అనుష్కాశర్మ, హీరో వరుణ్ ధావన్లు నటిస్తున్న నూతన చిత్రం ‘సూయీ థాగా’ ‘మేక్ ఇన్ ఇండియా’ థీమ్తో నిర్మితమవుతున్నఈ సినిమాను రియల్ లొకేషన్లలో చిత్రిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి శరత్ కటారియా దర్శకత్వం వహిస్తున్నారు. చందేరీ చీరల తయారీలోని కష్టనష్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఒక చెట్టుకి దారం రీల్స్ కట్టి ఉండగా ఆ చెట్టుకింద అనుష్క,,వరుణ్లు నిల్చుని ఉన్నారు.