రంగస్థలం మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీనుతో మూవీ చేస్తున్నాడు. తాజాగా చిత్ర షూటింగ్ ప్రస్తుతం అజర్ బైజాన్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా అక్కడా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తేనెటీగలు ఉండే ఓ ఫామ్ పక్కనే తాజా చిత్రీకరణ జరుగుతున్నది. తేనెటీగలు రేగి అందరినీ గాయపరిచే ప్రమాదం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులందరూ తమ పనులని ఎంతో జాగ్రత్తగా చేసుకుపోతున్నారని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేసింది.. షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ స్టిల్ ను కూడా పోస్ట్ చేసింది.. ఫేస్ కనపడకుండా, సిమ్మింగ్ ఫూల్ ఒడ్డున సేదతీరుతున్న రామ్ వెనుక భాగం ఫోటో ఇది.