ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారు.. చాలా రోజుల తర్వాత నిర్మాత గా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ను స్థాపించి ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది.
ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు వరుణ్ తేజ్ తన ‘ట్విట్టర్’ లో ఆవిష్కరించి, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె ఎల్ ఎన్ రాజు మాట్లాడుతూ..,థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ని స్థాపించి ఈ సినిమా ధ్వారా నూతన హీరో హీరోయిన్ లను పరిచయం చేస్తున్నాం ., ప్రతాప్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయంసాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని వరుణ్ తేజ్ ఆవిష్కరించటం సంతోషంగా ఉందని, కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.