నందు, నోయల్, పునర్నవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు కోటి రూపొందించిన చిత్రం ఎందుకో ఏమో. మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై మాలతి వద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎందుకో ఏమో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ల్యాబ్స్లో చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నోయల్ మాట్లాడుతూ…ఈ చిత్రంలో నాది కొంత నెగిటివ్ ఛాయలున్న పాత్ర. అయితే ఆ పాత్రలో మలుపులు ఉంటాయి. నందు, పునర్నవితో నటించడం స్నేహితులతో పనిచేసినట్లు అనిపించింది. యువతకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ విలువలు ఉన్న చిత్రమిది. అన్నారు. నాయిక పునర్నవి మాట్లాడుతూ…నిర్మాత మాలతి గారు కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు. ఆమె నాకు చక్కటి కాస్ట్యూమ్స్ రూపొందించారు. దర్శకులు చెప్పిన కథ బాగా నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను. సామాజిక మాధ్యమాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనే అంశాన్ని చూపిస్తున్నాం. అన్నారు. దర్శకుడు కోటి మాట్లాడుతూ…ముక్కోణపు ప్రేమ కథా చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు, యువతకు నచ్చే అంశాలుంటాయి. ప్రధాన పాత్రల్లోని ముగ్గురూ పోటాపోటీగా నటించారు. పతాక సన్నివేశాలు చిత్రానికి ఆకర్షణ అవుతాయి. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 12న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అన్నారు.
పోసాని, సూర్య, సుడిగాలి సుధీర్, నవీన్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – ప్రవీణ్, కెమెరామెన్ – జీఎస్ రాజ్, ఎడిటింగ్ – మధు, ఆర్ట్ – వర్మ, ఫైట్స్ – డ్రాగన్ ప్రకాష్.