రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రంలో నాయికగా నటిస్తోంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసుకుంది కియారా. చరణ్ సినిమాలో తన పని పూర్తవడంతో ఇప్పుడు తన తాజా బాలీవుడ్ చిత్రం గుడ్న్యూస్పై దృష్టి సారించింది. ఈ సినిమాలో కరీనాతో పాటు నటిస్తోంది కియారా. నటిగా తనకు భాషా బేధాలు లేవని ఈ భామ చెప్పింది. పాన్ ఇండియా నటి అనిపించుకోవడం తన లక్ష్యమంటోంది. ఏ భాష ప్రేక్షకులు నన్ను చూడాలని కోరుకున్నా…అక్కడ నటించేందుకు సిద్ధం అని చెప్పింది. ఈ సుందరి మాట్లాడుతూ…పాన్ ఇండియా ఎంటర్టైనర్ కావాలనే కోరిక ఉంది. నన్ను చూడాలనుకునే ప్రేక్షకులకు వినోదాన్ని అందించడాన్ని ఆస్వాదిస్తాను. మంచి కథలు నా దగ్గరకు వస్తే భాషలకు అతీతంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. వీలైనంత ఎక్కువమంది ప్రేక్షకులను ఆనందింపజేయడమే నా లక్ష్యం. అని చెప్పింది.