తమిళ హీరో విశాల్, దక్షిణాది హీరోయిన్ తమన్నా మరోసారి జోడికట్టబోతున్నారు..ఇప్పటికే ఈ ఇద్దరూ అంబల, కత్తిసండై, మదగజరాజ చిత్రాలలో నటించారు.. తాజాగా ఇప్పుడు సుందర్.సి. దర్శకత్వంలో కోలీవుడ్లో విశాల్, తమ్ము జంటగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. సుందర్ ప్రస్తుతం శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే విశాల్, మిల్కీ బ్యూటీ కాంబోలో సినిమాను మొదలుపెట్టనున్నారు.