సుధీర్బాబు, నభా నటేశ్ జంటగా నటిస్తున్న చిత్రం నన్నుదోచుకుందువటే. ఆర్.ఎస్. నాయుడు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సుధీర్బాబు నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్గా సుధీర్బాబు, అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో నభా నటేశ్ నటిస్తోంది. రొమాంటిక్ కామెడీతో వినోదాత్మక కథనంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈనెల 21న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్త్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా విజయంపై టీమ్ అందరం సంతోషంగా ఉన్నాం. హీరో, హీరోయిన్ పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి.
సమ్మోహనం వంటి మంచి హిట్ తర్వాత వస్తున్న సుధీర్ చిత్రమిది. మంచి అంచనాలున్నాయి. వాటికి చేరుకుంటామనే నమ్మకం ఉంది. నామీద నమ్మకంతో సొంత నిర్మాణ సంస్థలో సుధీర్బాబు అవకాశం కల్పించారు. అజనీష్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అన్నారు. చిత్ర కథానాయకుడు, నిర్మాత సుధీర్బాబు మాట్లాడుతూ ట్రైలర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రీ ప్రమోషనల్ టూర్ గ్రాండ్గా సక్సెస్ అయింది. దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు చక్కని కథ, స్క్రీన్ప్లే అందించారు. అన్ని వర్గాలని అలరించే చిత్రమిది అని పేర్కొన్నారు. ఇతర పాత్రల్లో తులసి, నాజర్, వేణు, రవివర్మ, జీవా, వర్షిణి, సౌందర్ రాజన్. సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం అజనీష్, ఛాయాగ్రహణం సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి వరుణ్.