గత ఏడాది హీరోయిన్ రష్మిక మందన్నాకు నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరి మఽధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని ఈ నిశ్చితార్థం రద్దు అయ్యిందనీ, రష్మిక, రక్షిత్ తమ ప్రేమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయం గురించి తాజాగా రష్మిక తల్లి సుమన్ ఓ ఛానెల్తో మాట్లాడారు. రష్మిక నిశ్చితార్థం రద్దయిందని స్పష్టం చేశారు. ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎటువంటి బంధం లేదనీ చెప్పారు. ‘‘ప్రతి ఒక్కరికీ జీవితం చాలా ముఖ్యమైంది. ఎదుటి వ్యక్తి బాధపెడితే ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. కొన్ని సమస్యలతో మా కుటుంబం డిస్టర్బ్ అయింది. ప్రస్తుతం కోలుకుంటున్నాం’’ అని ఆమె తెలిపారు. కన్నడలో హిట్టైన ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో రష్మిక, రక్షిత్ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో 2017 జూలై 3న నిశ్చితార్థం జరిగింది. ఇటీవల ‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక ‘దేవదాసు’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో బిజీగా ఉంది.